జాగిలాలతో తనిఖీలు

జాగిలాలతో తనిఖీలు

సుజాతనగర్, వెలుగు :  నార్కోటిక్స్, కొకైన్, గంజాయి లాంటి నిషేధిత మత్తు పదార్థాలను గుర్తించేందుకు పోలీసులు జాగిలలతో బుధవారం మండల కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. గత నెల 25న మండలంలోని వేపలగడ్డ గ్రామంలో రోడ్డు పక్కన గంజాయి బ్యాగ్ దొరికిన నేపథ్యంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలను కనుగొనేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న జాగిలాలను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నాగుల్ మీర, శివ శంకర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.