బెట్టింగ్ యాప్స్ కేసులో బిగ్ అప్డేట్.. రానా, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్ ఇవే

బెట్టింగ్ యాప్స్ కేసులో బిగ్ అప్డేట్.. రానా, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్ ఇవే

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు దర్యాప్తును పోలీసులు స్పీడప్ చేశారు. ఇప్పటికే కొందరు యూట్యూబర్లు, ఇన్‎ఫ్లూయెన్సర్లు, సినీ సెలబ్రెటీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా వారు ఏ బెట్టింగ్ యాప్స్‎కు ప్రమోషన్ చేశారనేది గుర్తించారు. ఈ మేరకు  పలు బెట్టింగ్ యాప్ కంపెనీలపై మియాపూర్‌ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 

సినీ యాక్టర్స్‌ ప్రమోట్ చేసిన బెట్టింగ్‌ యాప్స్‌:

దగ్గుబాటి రానా: జంగిల్‌ రమ్మి యాప్‌
విజయ్‌దేవరకొండ: ఏ23 యాప్‌
మంచు లక్ష్మి: యోలో 247 యాప్‌
 హీరోయిన్‌ ప్రణీత: ఫెయిర్‌ ప్లే లైవ్‌ యాప్
హీరోయిన్ నిధి అగర్వాల్‌: జీట్‌విన్‌ యాప్‌
యాంకర్ శ్యామల: ఆంధ్ర 365 యాప్‌
హర్షసాయి, విష్ణుప్రియ, రీతుచౌదరి, టేస్టీ తేజ, బయ్యా సన్నీలు పలు యాప్స్‌కు ప్రచారం చేసినట్లు గుర్తింపు

కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‎పై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న సినీ సెలబ్రెటీలు, యూట్యూబర్లు, ఇన్‎ప్లూయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బాలకృష్ణ, విజయదేవరకొండ, ప్రభాస్, మంచు లక్ష్మి, విష్ణు ప్రియ, నిధి అగర్వాల్, యాంకర్ శ్యామల, సుప్రియ, రీతు చౌదరి, టెస్టీ తేజ, భయ్యా సన్నీ యాదవ్ వంటి పలువురిపై కేసులు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.

ALSO READ | బెట్టింగ్ యాప్స్ కేసులో సంచలనం: సచిన్, విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్‎పై పంజాగుట్ట పీఎస్‎లో ఫిర్యాదు

ఇందులో ఇప్పటికే పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారించారు. మరికొందరికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో కోహ్లీ, సచిన్, షారుఖ్ ఖాన్ వంటి నేషనల్ సెలబ్రెటీస్‎పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అర్జున్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం సంచనలంగా మారింది. మరీ.. అర్జున్ గౌడ్ ఫిర్యాదు మేరకు సచిన్, కోహ్లీ, షారుఖ్ ఖాన్‎పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారా..? బిగ్ షాట్స్ కావడంతో ఆచీతూచీ వ్యవహరిస్తారా..? అనేది ఉత్కంఠగా మారింది.