భిక్కనూరు సెంటర్​ వద్ద ఘర్షణ

భిక్కనూరు సెంటర్​ వద్ద ఘర్షణ
  • పోటాపోటీగా కాంగ్రెస్​, బీజేపీల ప్రచారం
  • నిబంధనలను అతిక్రమిస్తున్నారని పోలీసుల అభ్యంతరం
  • ఏఎస్పీ చైతన్యరెడ్డి రావడంతో సద్దుమణిగిన గొడవ

భిక్కనూరు, వెలుగు : మండల కేంద్రంలోని బాలుర పాఠశాల పోలింగ్​ సెంటర్​ వద్ద గురువారం కాంగ్రెస్​, బీజేపీలు టెంట్లు వేసుకుని ప్రచారం చేశాయి.  ఎన్నికల నిబంధనల ప్రచారం గుంపులుగా ఉండి ప్రచారం చేయవద్దని ఎస్సై ఆంజనేయులు, సీఐ సంపత్​కుమార్​లు ఇరు పార్టీల లీడర్లకు తెలిపారు. కాంగ్రెస్​ వాళ్లు టెంట్​ తొలగిస్తే మేము తొలగిస్తామని బీజేపీ నాయకులు మొండికేశారు. 

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తున్నారంటూ ఇరుపార్టీలవారితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటిపోతుందని కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డికి ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న ఏఎస్పీ కాంగ్రెస్​, బీజీపీ లీడర్లతో మాట్లాడి అక్కడ నుంచి పంపించారు. అనంతరం ఆమె పోలింగ్​ స్టేషన్​ను పరిశీలించి, ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎస్సై, సీఐలకు సూచించారు.