
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించిన ఆఫీసర్స్, సిబ్బందికి ఎస్పీ బి. రోహిత్ రాజు మెడల్స్ అందజేశారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శుక్రవారం నిర్వహించిన ప్రోగ్రామ్లో ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో సేవలందించిన జిల్లాలోని 260 మందికి ఇటీవల మెడల్స్ను ప్రకటించిందని తెలిపారు. కఠిన సేవా, ఉత్తమ సేవా, సేవా పతకాలతో పాటు యాంత్రిక్ సురక్షా సేవా పతకాలను అందజేయడం ఆనందంగా ఉందన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. డ్యూటీలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ పోలీసులు ముందుండడం అభినందనీయమన్నారు. ప్రోగ్రామ్కు ముందు జరిగిన పరేడ్లో 15 రోజుల పాటు సాగిన జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది మొబిలైజేషన్ ముగింపు సందర్భంగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ రిటైర్ అయిన పలువురు పోలీస్ ఆఫీసర్లను ఎస్పీ సన్మానించారు. ఈ ప్రోగ్రామ్లో ఏఆర్డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ సీఐలు నాగరాజు, శ్రీనివాస్, అడ్మిన్ఆర్ఐ లాల్బాబు, హోంగార్డ్స్ ఆర్ఐ కృష్ణారావు, ఆర్ఐ నర్సింహరావు, ఎంటీవో సుధాకర్, వెల్ఫేర్ఆర్ఐ కృష్ణారావు పాల్గొన్నారు.