పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ఆసిఫాబాద్/​జైపూర్/చెన్నూర్/బోథ్, వెలుగు: విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పోలీస్​అధికారులు కొనియాడారు.పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​ డిస్పెన్సరీలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో 250 మంది పాల్గొని రక్తదానం చేశారు. క్యాంప్​ను ఎస్టీపీపీ జీఎం రాజశేఖర్ రావుతో కలిసి మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరీశిలించారు. చెన్నూర్​లోని ప్రభుత్వ ఆస్పత్రిలో జైపూర్ ఏసీపీ వెంకటే శ్వర్లు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో 300 మంది యువకులు, పోలీసులు పాల్గొని పెబ్లడ్ డొనేట్ చేశారు.

సీఐ రవీందర్, రూరల్ సీఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్​లో ఏర్పాటుచేసిన శిబిరంలో యువకులు పాల్గొని 51 యూనిట్ల రక్త దానం చేశారు. హాజరైన అడిషనల్ ఎస్పీ ఆర్.ప్రభాకరరావు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం, రక్తదానంపై అపోహలు వీడాలని పిలుపునిచ్చారు. బోథ్​పోలీస్​స్టేషన్​ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో 84 మంది నుంచి 84 యూనిట్ల రక్తం సేకరించినట్లు సీఐ రమేశ్,​ ఎస్​ఐ ప్రవీణ్​ కుమార్​ తెలిపారు. రక్త దానం ప్రాణదానంతో సమానమన్నారు.