మందమర్రిలో ఆకట్టుకున్న పోలీస్, ప్రెస్​క్రికెట్ ​మ్యాచ్

మందమర్రిలో ఆకట్టుకున్న పోలీస్, ప్రెస్​క్రికెట్ ​మ్యాచ్
  • ఒక్క పరుగు తేడాతో పోలీస్​ జట్టు విజయం

కోల్ బెల్ట్, వెలుగు: యాంటీ డ్రగ్స్​అవేర్నెస్​లో భాగంగా మందమర్రి పట్టణం సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో ఆదివారం నిర్వహించిన పోలీస్, ప్రెస్​ ఫ్రెండ్లీ క్రికెట్​ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. 14 ఓవర్ల మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​చేసిన పోలీసుల జట్టు 111 రన్స్​ చేసింది. కెప్టెన్ ఎస్సై రాజశేఖర్ 32, కానిస్టేబుల్​రాకేశ్ 27​ రన్స్​చేశారు. ప్రెస్​ క్లబ్​కు చెందిన కడారి శ్రీధర్ ​మూడు వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన ప్రెస్​ క్లబ్​ జట్టు క్రీడాకారులు దూకుడుగా ఆడారు. అనిల్ 31​, సతీశ్ 33​  రన్స్​ సాధించారు. కానీ నిర్దేశిత 14 ఓవర్లలో 110 రన్స్​ మాత్రమే చేసి ఒక పరుగు తేడాతో ఓటమి పాలయ్యారు. ఎస్సై రాజశేఖర్​4 వికెట్లు తీశారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఎస్సైకి ​మ్యాన్​ఆఫ్ ​ది మ్యాచ్​అవార్డు దక్కింది.

విజేతలకు బెల్లంపల్లి ఎసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్​ రెడ్డి ట్రోఫీ అందజేశారు. ఏసీపీ మాట్లాడుతూ.. నేరాల నుంచి యువతను దూరంగా ఉంచేందుకు క్రీడలు మంచి మార్గమన్నారు. డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు అంతా కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.