
కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం యాపల్కు చెందిన ఆకుదారి సతీశ్ తన కూతురు(15) పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు బుధవారం పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు పంపించారు. మందమర్రి టౌన్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్గా పనిచేసే సతీశ్ తరచూ తనభార్యతో పెద్ద కూతురు తనకు పుట్టలేదంటూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో పోచమ్మ బోనాల పండుగ ఉందని చెప్పి మంగళవారం మధ్యాహ్నం హాస్టల్లో చదువుకుంటున్న కూతురును ఇంటికి తీసుకువచ్చాడు.
రాత్రి మద్యం మత్తులో కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకున్న భార్యను కర్రతో కొట్టాడు. భర్త అసభ్య ప్రవర్తనపై ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. బాలికను కౌన్సిలింగ్ నిమిత్తం భరోసా సెంటర్ కు పంపించినట్లు ఎస్సై తెలిపారు.