హైదరాబాద్ సిటీలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు

హైదరాబాద్ సిటీలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు

హైదరాబాద్: భాగ్య నగర వాసులకు పోలీసు శాఖ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ సిటీలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందని, U/S 163 BNS యాక్ట్ ప్రకారం ఆంక్షలు విధిస్తున్నామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.

సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నవంబర్ 28 వరకు.. నెల రోజుల పాటు ఆంక్షలు అమలవుతాయని పోలీస్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.