
సిద్దిపేట రూరల్, వెలుగు: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. శుక్రవారం సీఐలు రమేశ్, నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట టూ టౌన్ పీఎస్పరిధిలోని నర్సాపూర్ చౌరస్తా కుంకుమ మిల్లు వద్ద మూడు వాహనాలు, చిన్న కోడూర్ పీఎస్పరిధిలోని రెండు లారీల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం వచ్చింది.
సిబ్బందితో కలిసి వెళ్లి ఐదు వాహనాలు పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎవరైనా అక్రమంగా ఇసుక, పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 తెలియజేయాలన్నారు.