కేటీఆర్ ​ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

కేటీఆర్ ​ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

పంజాగుట్ట, వెలుగు: బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​ఇంటి ఎదుట సోమవారం బంజారాహిల్స్​పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం గ్రూప్​–1 మెయిన్స్​నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచే నందినగర్​లోని కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. 

అయితే, ఏసీపీ సామల వెంకటరెడ్డితో కేటీఆర్​మాట్లాడారు. తాను అశోక్​నగర్​కు గానీ, గ్రూప్​1​ ఎగ్జామ్​జరిగే ప్రాంతాలకు గానీ వెళ్లడం లేదని.. వెళ్తే చెప్పే వెళ్తానని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి, గెల్లు శ్రీనివాస్​యాదవ్​తదితరులు కేటీఆర్​ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేటీఆర్​ వారితో కలిసి ఈఆర్సీ ఆఫీసుకు వెళ్లారు. వారి వెంటే ఏసీపీ సామల వెంకట్​రెడ్డి, ఇన్​స్పెక్టర్ ​రాఘవేంద్ర వెళ్లారు.