- వెహికల్స్తో శబ్ధ కాలుష్యం చేస్తే చర్యలు : ఏఎస్సీ చైతన్య రెడ్డి
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధిక సౌండ్ వచ్చేలా బిగించుకొని శబ్ధ కాలుష్యం చేస్తున్న 65 సైలెన్సర్లను రోడ్ రోలర్ తో పోలీసులు తొక్కించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్లో ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. టౌన్లో విస్తృతంగా వెహికిల్స్ తనిఖీలు చేపట్టగా 2 నెలల కాలంలో అధిక శబ్ధం వచ్చే 65 వెహికిల్స్ సైలెన్షర్లను తొలగించి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
ఏఎస్సీ చైతన్యరెడ్డి మాట్లాడుతూ.. ఇక మీదట ఎవరూ కూడా ఎక్కువ సౌండ్ వచ్చే సైలెన్సర్లను వాడకూడదన్నారు. రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టౌన్ సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సైలు శ్రీరామ్, మహేశ్ పాల్గొన్నారు.