_fcH0Q7m9bR.png)
అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, శుభలేఖ సుధాకర్, షాయాజీ షిండే, హిమజ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బెల్లి జనార్థన్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన జయసుధ, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్ నారాయణ మూర్తి మంచి కంటెంట్తో రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుతూ టీమ్కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
అజయ్ ఘోష్ మాట్లాడుతూ ‘ఇందులో నేను చాలా గొప్ప పాత్రను పోషించాను. అందర్నీ ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన బాబ్జీ గారికి థ్యాంక్స్’ అని చెప్పాడు. షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు అన్నారు.