ఉన్న పదవితో సంతృప్తిగానే ఉన్నా..కొత్తగా ఏమీ ఆశించడం లేదు

ఉన్న పదవితో సంతృప్తిగానే ఉన్నా..కొత్తగా ఏమీ ఆశించడం లేదు
  • మీడియాతో చిట్​చాట్​లో మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం ఉన్న రాజకీయ  జీవితంతో తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తనకు సీఎం కావాలనే కోరిక లేదని,  ఏ పదవులనూ తాను ఆశించడం లేదని తెలిపారు. గురువారం అసెంబ్లీలోని తన చాంబర్ లో మీడియా తో చిట్ చాట్ చేశారు. 

స్పీకర్ పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్​ తీవ్రంగా ఖండించారు. దళిత స్పీకర్ ను అవమానపరిచేలా జగదీశ్​ మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగదీశ్​రెడ్డిలా ఎవరూ ప్రవర్తించకూడదని అన్నారు.

ఎస్‌‌ఎల్‌‌బీసీలో రోబోలతో పనులు చేయిస్తున్నందున, సంబంధిత సంస్థకు రూ. 4 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఈ ఘటనతో ఎస్ఎల్‌‌బీసీ నిర్మాణంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, సాధ్యమైనంత త్వరలోనే పని పూర్తి చేస్తామని చెప్పారు. ఇలాంటి ప్రమాదం ఇప్పటివరకూ ఎప్పుడూ.. ఎక్కడా.. జరగలేదని, ఇక్కడ జరగడం 
దురదృష్టకరమని పేర్కొన్నారు.