
మెదక్టౌన్, వెలుగు: ఈ నెల 24న జరిగే పాలిసెట్ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్మహిళాపాలిటెక్నిక్కాలేజీ ప్రిన్సిపాల్సువర్ణలత తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 24న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
మెదక్ పట్టణంలో ప్రభుత్వ బాలికల స్కూల్ బ్రాహ్మణవీధి, గవర్నమెంట్డిగ్రీ కాలేజ్హౌసింగ్ బోర్డ్ కాలనీ, సిద్దార్థ ఆదర్శ జూనియర్ కాలేజ్ బ్రాహ్మణవీధి, సిద్ధార్థ మోడల్ హై స్కూల్- వెంకట్రావునగర్ కాలనీ సెంటర్లలో పరీక్షలు జరుగుతాయన్నారు. స్టూడెంట్స్సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.