
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్–2021) నోటిఫికేషన్ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీఈటీ) రిలీజ్ చేసింది. ఈ పరీక్షతో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజినీరింగ్/నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు.
డిప్లొమా కోర్సులు అందిస్తున్న సంస్థలు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నికల్ కాలేజీలు.
అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. కంపార్ట్మెంటల్ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
సెలెక్షన్ ప్రాసెస్: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఎంపిక
క్వాలిఫైయింగ్ మార్క్స్
ఇంజినీరింగ్&నాన్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్: మ్యాథ్స్(60)+ఫిజిక్స్(30)+కెమిస్ట్రీ(30)=120 మార్కులుకు పరీక్ష నిర్వహిస్తారు.
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్: మ్యాథ్స్(60)+ఫిజిక్స్(30)+కెమిస్ట్రీ(30)+బయాలజీ(30)=150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.
ఇంజినీరింగ్, నాన్ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే వారు బయాలజీ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలను అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.పాలీసెట్ క్వాలిఫై అవ్వాలంటే అన్ని సబ్జెక్టుల్లో కలిపి కనీసం 30 శాతం (మొత్తం 120 మార్కులకు 36 మార్కులు) సాధించాలి.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి
ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం: 24 మే 2021
దరఖాస్తుకు చివరితేది: 11 జూన్ 2021
రూ.300 ఫైన్తో: 15 జూన్ 2021
ఎగ్జామ్డేట్: వెల్లడించాల్సి ఉంది
వెబ్సైట్: https://polycetts.nic.in
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
మ్యాథమెటిక్స్ 60 60
ఫిజిక్స్ 30 30
కెమిస్ట్రీ 30 30
మొత్తం 120 120