
- రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
హనుమకొండ/ భీమదేవరపల్లి, వెలుగు: దేశంలో కాంగ్రెస్ బలం పెరుగుతోందనే పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీపై ఈడీ పేరుతో వేధింపులు షురూ చేశారని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్నియోజకవర్గ పరిధి భీమదేవరపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ అంటేనే ఈడీ, మోడీ, ఐటీ దాడులన్నారు. దేశంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతోందని, ప్రజల పక్షాల ఉద్యమాలు చేస్తుంటే బీజేపీపై వ్యతిరేకత ఎక్కువవుతోందన్నారు.
అది తట్టుకోలేక అగ్రనేతలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో నిజంగా ఏదైనా పొరపాటు చేసి ఉంటే చర్యపరమైన యాక్షన్ తీసుకోవచ్చని, కానీ ఈడీని కేవలం వేధింపుల కోసమే ఉపయోగిస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్కు దండ వేసి నివాళులర్పించలేని నాయకులు ఆయన పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.