కరీంనగర్ నుంచి తిరుపతికి డైలీ రైలు నడపండి : పొన్నం

కరీంనగర్ నుంచి తిరుపతికి  డైలీ రైలు నడపండి : పొన్నం

తిరుమల శ్రీవారి దర్శనానికి ఉత్తర తెలంగాణ నుంచి భారీగా భక్తులు  వెళ్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  తిరుపతి వెళ్ళ వారి ప్రయాణికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ నుంచి తిరుపతికి నిత్యం రైలు నడపాలని  కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు  విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం. ఈ మేరకు ఆయనకు లేఖ  రాశారు

కరీంనగర్ నుంచి తిరుపతి రైలు (12762) (ఆది ,గురు) ,తిరుపతి నుంచి కరీంనగర్ (12761)(బుధ,శని) రైలు ప్రస్తుతం వారానికి రెండు సార్లు  మాత్రమే  నడుస్తుంది.  ఈ రైలును తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతి వెళ్ళడానికి సులభతరంగా ఉంటుందని యూపీఏ ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది.  తరువాత ఈ రైలుని ప్రతిరోజూ నడిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి  గత 10 సంవత్సరాలుగా రైల్వే శాఖ మంత్రిగా మీకు , స్థానిక ఎంపీ బండి సంజయ్ కి విజ్ఞప్తి చేస్తున్నా. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతి రోజు రైలు నడిపేలా చర్యలు తీసుకోండి అని కోరారు మంత్రి పొన్నం.

ALSO READ | కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్‎కు రాష్ట్ర మంత్రుల వినతి