న్యూఇండియా బ్యాంక్​ బోర్డు రద్దు

న్యూఇండియా బ్యాంక్​ బోర్డు రద్దు

న్యూఢిల్లీ:ముంబై కేంద్రంగా పనిచేసే న్యూ ఇండియా బ్యాంకుపై పలు కఠిన చర్యలు తీసుకున్న మరునాడే ఆర్​బీఐ దాని బోర్డును కూడా రద్దు చేసింది. పాలనాపరమైన లోపాల వల్లే బోర్డును 12 నెలల పాటు సస్పెండ్ ​చేసినట్టు తెలిపింది. 

కొత్త లోన్లు ఇవ్వకూడదని, డిపాజిట్​ విత్​డ్రాలను ఆరు నెలల పాటు ఆపాలని స్పష్టం చేసింది. దీనికి 28 బ్రాంచ్​లు ఉన్నాయి. బ్యాంకు నిర్వహణ కోసం ఎస్​బీఐ మాజీ అధికారి శ్రీకాంత్​ను అడ్మినిస్ట్రేటర్​గా నియమించింది.