గోదావరిఖనిలో హమాలీ కార్మికుల నిరసన

గోదావరిఖనిలో హమాలీ కార్మికుల నిరసన

గోదావరిఖని, వెలుగు: తమకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్‌‌ చేస్తూ హమాలీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో  గోదావరిఖనిలో హమాలీలు ఆదివారం నిరసనకు దిగారు. యూనియన్​ అధ్యక్షుడు ఎంఏ గౌస్ మాట్లాడుతూ గోదావరిఖని కూరగాయల మార్కెట్​లో దాదాపు 200 మంది హమాలీ వర్కర్స్ హోల్‌‌సేల్ వ్యాపారుల వద్ద పని చేస్తున్నారని, కూలీ రేట్ల పెంపు కాలపరిమితి ముగిసినా మూడేండ్ల కింద పెంచిన రేట్లనే చెల్లిస్తున్నారన్నారు. లీడర్లు కండె లక్ష్మయ్య, రాంచందర్, సతీష్, ఎం.డి.జానీమియా పాల్గొన్నారు.