
ములకలపల్లి, వెలుగు : మండలంలోని మంగపేట అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దమ్మపేట ప్రాజెక్టు సీడీపీవో జ్యోతి మాట్లాడారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ఉపయోగాలను వివరించారు. తల్లులకు ప్రీస్కూల్ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించి ఓ చిన్నారికి అన్నప్రాసన, మరొకరికి బర్త్డే సెలబ్రేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీడీపీవో సీతారాములు, సూపర్వైజర్ సామ్రాజ్యం, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.