మాధవ్, సిమ్రన్ శర్మ జంటగా ‘పెళ్లిసందడి’ ఫేమ్ గౌరీ రోణంకి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. జేజేఆర్ రవిచంద్ నిర్మించారు. నవంబర్లో సినిమా విడుదల. ఇటీవల విడుదలైన ట్రైలర్, కాంతార అనే పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సందర్భంగా ధృవ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
దర్శకురాలు గౌరీ బర్త్ డే వేడుకను ఇదే వేదికపై సెలెబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రవిచంద్ మాట్లాడుతూ ‘ట్రైలర్కు 2 మిలియన్ వ్యూస్ రావడం సంతోషంగా ఉంది. అలాగే కాంతార కాంతార పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కష్టపడే తత్వం ఉన్న మాధవ్కు మంచి భవిష్యత్ ఉంది’ అని చెప్పారు. హీరోహీరోయిన్స్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నటుడు ‘రంగస్థలం’ మహేష్ పాల్గొన్నారు.