
సొసైటీలో గౌరవంతోపాటు గుర్తింపునిచ్చే ‘లా కెరీర్’ కు డిమాండ్ పెరుగుతోంది. దేశంలో ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఇంటర్ కంప్లీట్ చేసిన వారికి ఇంటిగ్రేటెడ్ ‘లా’ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లాసెట్, నేషనల్ లెవెల్లో క్లాట్ ఎంట్రెన్స్ల ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. ఆయా ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు ఇంకా గడువు ఉన్న నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ లా కోర్సు కెరీర్ గైడెన్స్ ఈ వారం.
లా కెరీర్ కోరుకునేవారు ఇంటర్మీడియట్ నుంచే ఆ దిశగా అడుగులు వేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో లాసెట్ రాసి అయిదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులో చేరవచ్చు. జాతీయ స్థాయిలో క్లాట్కు హాజరై మంచి స్కోర్ చేస్తే డిగ్రీ, ఎల్ఎల్బీ కలిపి చదువుకోవచ్చు. ఇదీ అయిదేళ్లకే పూర్తవుతుంది. సాధారణంగా ఇంటర్ తర్వాత డిగ్రీ మూడేళ్లు, మళ్లీ ఎల్ఎల్బీ మూడేళ్లు మొత్తం ఆరేళ్ల సమయం పడుతుంది. ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరితే ఒక ఏడాది ఆదా అవడంతోపాటు సబ్జెక్టుపై పట్టు సంపాదించడానికి అవకాశం దక్కుతుంది.
నచ్చిన స్ట్రీమ్లో..
స్టూడెంట్స్ ఇంటర్లో పూర్తి చేసిన సబ్జెక్టులు/వారికి నచ్చిన స్ట్రీమ్లో లా పూర్తి చేయొచ్చు. దేశంలో వివిధ స్ట్రీమ్స్లో ఇంటిగ్రల్ లా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్స్ స్ట్రీమ్లో బీఏ + ఎల్ఎల్బీ, బీఏ + ఎల్ఎల్బీ(హానర్స్), కామర్స్ & బిజినెస్ స్ట్రీమ్లో బీబీఏ+ ఎల్ఎల్బీ, బీకామ్ + ఎల్ఎల్బీ, సైన్స్ & టెక్నాలజీ స్ట్రీమ్లో బీఎస్సీ + ఎల్ఎల్బీ, బీటెక్ + ఎల్ఎల్బీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అడ్మిషన్స్ ఇలా..
ఇంటిగ్రేటెడ్ లా చదవాలంటే ఇంటర్ తర్వాత లాసెట్/క్లాట్/ఏఐఎల్ఈటీ తదితర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. వీటిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్ కల్పిస్తారు. వీటితోపాటు కొన్ని ప్రైవేటు వర్సిటీలకు ఎల్శాట్ ఇండియా, సింబయాసిస్ ఎంట్రెన్స్ టెస్ట్ వంటి ప్రత్యేక పరీక్షలు ఉన్నాయి. తెలంగాణలో లాసెట్ ద్వారా ప్రభుత్వ కన్వీనర్ సీట్లు, మేనేజ్మెంట్ కోటా సీట్లు అందుబాటులో ఉండగా, క్లాట్ ద్వారా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఇంటిగ్రేటెడ్ లా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
లాసెట్ 2021
ఇంటర్ తర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో ప్రవేశాలకు ఇప్పటికే లాసెట్ 2021 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ ఎంట్రెన్స్ అప్లికేషన్ గడువును కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మే 26 వరకు పొడిగించారు.
కోర్సు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ
సీట్లు: మొత్తం 2,325 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 1861 కన్వీనర్ కోటా కాగా.. మేనేజ్మెంట్ కోటాలో 464 సీట్లు ఉన్నాయి.
అర్హతలు: 10+ 2 విధానంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. జనరల్, బీసీ అభ్యర్థులు ఇంటర్లో 45 శాతం మార్కులు స్కోర్ చేసి ఉండాలి. ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: మల్టిపుల్ చాయిస్ విధానంలో 120 మార్కులకు ఎంట్రెన్స్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. టెస్ట్ డ్యురేషన్ 90 నిమిషాలు. లాసెట్లో జనరల్ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు అంటే 120లో 42 మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు.
దరఖాస్తులు: ఆన్లైన్లో..
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 800, ఎస్సీ ఎస్టీ, పీహెచ్ స్టూడెంట్స్ రూ. 500 చెల్లించాలి.
అప్లికేషన్లకు చివరి తేది: మే 26
వెబ్సైట్: www.lawcet.tsche.ac.in