పోస్ట్​మార్టంలో.బయటపడిన చావుగుట్టు.. బాచుపల్లి ఎస్ఎల్జీ డాక్టర్​ అరెస్ట్​

పోస్ట్​మార్టంలో.బయటపడిన చావుగుట్టు.. బాచుపల్లి ఎస్ఎల్జీ డాక్టర్​ అరెస్ట్​

జీడిమెట్ల, వెలుగు: సరైన వైద్యం అందక ఓ పేషెంట్​మృతిచెందిన కేసులో డాక్టర్​ను అరెస్ట్​చేసినట్లు సీఐ ఉపేందర్​ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం. .  వరంగల్ కు చెందిన సరస్వతి(43) కడుపునొప్పితో బాధపడుతూ గతేడాది జూలైలో బాచుపల్లి ఎస్​ఎల్​జీ హాస్పిటల్​లో చేరింది.  డాక్టర్​సతీశ్​కుమార్​ఆమెకు సరైన వైద్యం అందిచక పోవడంతో చనిపోయింది. 

డాక్టర్​నిర్లక్ష్యం వల్లే తన తల్లి మృతిచెందిందని మృతురాలి కుమారుడు ప్రమోద్​బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, వారు కేసు నమోదు చేసి, డెడ్​బాడీని పోస్ట్ మార్టమ్​ఎగ్జామినేషన్(పీఎంఈ)కు పంపించారు. రిపోర్ట్​లో ట్రీట్​మెంట్​సరిగా అందకనే చనిపోయినట్లు వచ్చింది. డాక్టర్ సతీశ్​కుమార్​ను సోమవారం అరెస్ట్​చేశామని సీఐ తెలిపారు. ఆయన స్టేట్ మెంట్​ఆధారంగా హాస్పిటల్ నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.