క్యాట్​ ఉత్తర్వులను అమలు చేయాలి:తపాల ఉద్యోగులు

క్యాట్​ ఉత్తర్వులను అమలు చేయాలి:తపాల ఉద్యోగులు
  • తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగులు

బషీర్ బాగ్ , వెలుగు: అబిడ్స్ లోని డాక్ సదన్, జీపీఓ ముందు కుటుంబ సభ్యులతో కలిసి తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగుల జేఏసీ మౌన దీక్షకు దిగింది. క్యాట్ ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని జేఏసీ అధ్యక్షుడు ఎర్రం శెట్టి దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. 

తమ న్యాయబద్ధమైన హక్కుల సాధనకు మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. అన్నిరకాల రాయితీలు ఇవ్వడంతోపాటు పోస్టల్ డైరెక్టరేట్ ఆదేశాలను అమలు చేయాలని కోరారు. దీక్షలో జేఏసీ నాయకులు పబ్బు యాదగిరి, ఇంద్రసేనారెడ్డి, కె.యాదగిరి, శ్రవణ్ కుమార్, కేవీకే మోహన్, ఎల్జిబెత్ క్రిస్టియన్, కారుణ్య, శారద, శ్రీలక్ష్మి, నళిని తదితరులు పాల్గొన్నారు.