మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

గుండాల, వెలుగు : గుండాల మండలంలోని పలు గ్రామాల్లో మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.  గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మండలంలో పలుచోట్ల ఈ పోస్టర్లను అంటించారు. వారం రోజుల కింద ఈ తరహా పోస్టర్లనే గుండాల, ఇల్లెందు, కరకగూడెం  మండలాల సరిహద్దుల గ్రామాల్లో వెలిసిశాయి. కొంతకాలంగా ఛతీస్ గఢ్​ రాష్ట్రంలో జరుగుతున్న మావోయిస్టు చర్యలకు అమాయక ఆదివాసి ప్రజలు బలి అవుతున్నారని, ప్రజలు, సంఘాలు మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడాలని, వారికి సహకరించొద్దని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.