
- ఒకరు సీపీఐ ఎంఎల్లిబరేషన్ లీడర్
- మరొకరు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జి
- నోటీసులు ఇచ్చిన పోలీసులు
పాలకుర్తి, వెలుగు : పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు వ్యతిరేకంగా వాట్సాప్లో పోస్టులు పెట్టారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన జోగు కుమార్ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఈనెల 21న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి మండల కేంద్రంలోని అంగడిలో రేకుల షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో సీపీఐ ఎంఎల్లిబరేషన్ పార్టీకి చెందిన లీడర్ మామిండ్ల రమేశ్రాజా...‘దొరా ఇంతకాలం ఏం చేశారు.
ఇన్ని రోజులకు అంగడి గుర్తుకు వచ్చిందా? గతంలో..ప్రస్తుతం పాలకుర్తి ఏం అభివృద్ధి చెందింది. చర్చకు సిద్ధమా?’ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నిలదీస్తూ వాట్సాప్లోకల్గ్రూపుల్లో పోస్టు పెట్టాడు. అలాగే మండలంలోని బొమ్మెర గ్రామానికి చెందిన కాంగ్రెస్పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి కొండా శ్రీను కూడా రెండు రోజుల క్రితం మంత్రిని విమర్శిస్తూ రెండు పోస్టులను పెట్టాడు. ఓ పేపర్లో ఎర్రబెల్లిపై వచ్చిన కథనాన్ని షేర్ చేయడంతో పాటు ‘మంత్రి ఇలాకాలో కబ్జా నిజమేనా? తొర్రూరు చుట్టూ ఉన్న 250 ఎకరాల భూమి గురించి మాట్లాడాలంటే భయపడుతున్న జనం. రియల్ దందానా? లేక అబద్దపు ప్రచారమా? మంత్రి ఇలాకాలో కబ్జా నిజమేనా? అంటూ మరో పోస్ట్పెట్టాడు. దీంతో మంత్రి ఎర్రబెల్లిపై అభ్యంతరకరంగా పోస్టులు చేస్తున్నారని ఆరోపిస్తూ కృష్ణ అనే బీఆర్ఎస్ కార్యకర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇద్దరికీ నోటీసులు ఇచ్చామని పోలీసులు చెప్పారు.