తేడా వస్తే తాండవమే..

తేడా వస్తే తాండవమే..

షెరాజ్ మెహ్ది హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పౌరుషం’. సుమన్, ఆమని,  మేకా రామ కృష్ణ, గీత రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి నిర్మిస్తున్నారు.  ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను లాస్ ఏంజిల్స్‌‌‌‌లో రిలీజ్ చేశారు.

‘వాడు శివుడి అంశ.. తేడా వస్తే తాండవమే’ అనే డైలాగ్‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌లో హైలైట్‌‌‌‌గా నిలిచింది. ఎమోషనల్ కంటెంట్‌‌‌‌తో యువతరానికి చక్కని  సందేశాన్ని అందించేలా ఈ సినిమాని తెరకెక్కించినట్టు మేకర్స్ తెలియజేశారు.