షెరాజ్ మెహ్ది హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పౌరుషం’. సుమన్, ఆమని, మేకా రామ కృష్ణ, గీత రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ను లాస్ ఏంజిల్స్లో రిలీజ్ చేశారు.
‘వాడు శివుడి అంశ.. తేడా వస్తే తాండవమే’ అనే డైలాగ్ ట్రైలర్లో హైలైట్గా నిలిచింది. ఎమోషనల్ కంటెంట్తో యువతరానికి చక్కని సందేశాన్ని అందించేలా ఈ సినిమాని తెరకెక్కించినట్టు మేకర్స్ తెలియజేశారు.