ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ సినిమా రీ-రిలీజ్..

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ సినిమా రీ-రిలీజ్..

తెలుగులో జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ఈశ్వర్ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రం హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా, తమిళ్ హీరోయిన్ శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ ఇద్దరూ కూడా ఈశ్వర్ చిత్రంతో తెరంగేట్రం చేశారు. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి 22 ఏళ్లు అయ్యింది. ఈ సమయంలో ప్రభాస్ రేంజ్ పూర్తీగా మారిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి, కల్కి, సాహో, తదితర చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. 

అయితే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఈశ్వర్ సినిమా ని పలు థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈశ్వర్ 4K వెర్షన్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈశ్వర్ ట్రైలర్ ని కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. దీంతో తమ అభిమాన నటుడి సినిమా ని 22 ఏళ్ల తర్వాత థియేటర్లో రిలీజ్ అవుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

అయితే ఈ విషయం గురించి హీరోయిన్ శ్రీదేవి సోషల్ మీడియాలో స్పందించింది. ఈ సందర్బంగా ఈశ్వర్ చిత్ర విశేషాలను అభిమానులతో పంచుకుంది. ఇక ఈశ్వర్ సినిమాతో తాను హీరోయిన్ గా కెరీర్ ఆరంభించానని దాంతో ఈ చిత్రం చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది. ఇక తాను ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు హైదరాబాద్ కి కొత్త కావడంతో ధూల్పేట్ తెలంగాణ స్లాంగ్  అంత త్వరగా వచ్చేది కాదని కానీ డైరెక్టర్ పరాంజీ ఈ విషయంలో చాలా హెల్ప్ చేశారని తెలిపింది. ఈశ్వర్ రీ రిలీజ్ ని కూడా ఫ్యాన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేసింది.