ఫిబ్రవరి 28 నుంచి ప్రచయ్​క్యాపిటల్​ ఎన్సీడీ ఇష్యూ

 ఫిబ్రవరి 28 నుంచి ప్రచయ్​క్యాపిటల్​ ఎన్సీడీ ఇష్యూ

హైదరాబాద్​, వెలుగు: ఎన్​బీఎఫ్​సీ ప్రచయ్​క్యాపిటల్​ లిమిటెడ్ సెక్యూర్డ్​, రిడీమబుల్​నాన్​–కన్వర్టబుల్ ​ఎన్సీడీల పబ్లిక్ ​ఇష్యూ ఈ నెల 28న మొదలై వచ్చే నెల 15న ముగుస్తుందని ప్రకటించింది. ఇష్యూ ద్వారా రూ.100 కోట్లు సేకరిస్తామని తెలిపింది. ఇవి బీబీబీ/స్టేబుల్ ​క్రిసిల్​ రేటెడ్​ ఎన్సీడీలు కాగా ఏడాదికి 13 శాతం వడ్డీ చెల్లిస్తారు. 

ఫండ్​ యుటిలైజేషన్​ కోసం ఈ డబ్బును వాడతామని ప్రచయ్ ​క్యాపిటల్​ ఎండీ గిరీశ్​ మురళీధర్​ చెప్పారు. తమ ఏయూఎం విలువ గత మార్చి నాటికి రూ.285.70 కోట్లకు చేరిందని అన్నారు.