మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజావాణికి 594 ఫిర్యాదులు

మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజావాణికి 594 ఫిర్యాదులు

పంజాగుట్ట,వెలుగు: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం ప్రజావాణికి 594 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూ 141, సివిల్ సప్లై 86, విద్యుత్​58, హౌసింగ్​56 , పంచాయితీ రాజ్​ 54, ఇతర శాఖలు199  ఫిర్యాదులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పర్యవేక్షణలో నోడల్ అధికారి దివ్య దేవరాజన్​ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

ఇందులో ప్రధానంగా వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని, గోదావరి ఖనిలో సింగేణి ఉద్యోగుల క్వార్టర్లను కూల్చేందుకు యత్నం, కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించాలని వంటి వాటిపై ఫిర్యాదులు చేశారు.