Tirumala Laddu Row: మనకేం కావాలి.. పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్..

Tirumala Laddu Row: మనకేం కావాలి..  పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్..

ఏపీలో తిరుమల లడ్డు వివాదం రేపిన రాజకీయ దుమారం ఇప్పట్లో సద్దుమనిగేలా లేదు. వైసీపీని టార్గెట్ చేస్తూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కాస్తా నేషనల్ ఇష్యూగా మారాయి. ఇది చాలదన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ ఇవ్వటం మరో వివాదానికి తెర లేపింది. హీరో కార్తీకి పవన్ వార్నింగ్ ఇవ్వడంపై కోలీవుడ్ వర్గాలు మండిపడుతున్నాయి. మరో పక్క నటుడు ప్రకాష్ రాజ్ కూడా వరుస ట్వీట్లతో పవన్ కళ్యాణ్ కు చురకలంటిస్తున్నారు. తాజాగా మరో ట్వీట్ తో పవన్ కు కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్.

మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది సాధించటమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా... జస్ట్ అస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా పవన్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా చురకలంటించారు ప్రకాష్ రాజ్.

ALSO READ : ఇదేమి ఆనందం పవన్..! ప్రకాష్ రాజ్ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్

రాజకీయవర్గాల్లోనే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదం ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. కాగా.. శనివారం ( సెప్టెంబర్ 28, 2024 ) వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించటం కూడా చర్చనీయాంశం అయ్యింది.