హ‌ఠాత్తుగా ఎందుకింత‌ ప్రేమో.. పవన్ టార్గెట్‎గా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్

హ‌ఠాత్తుగా ఎందుకింత‌ ప్రేమో.. పవన్ టార్గెట్‎గా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్‎గా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూ మొదలైన నాటి నుండి పవన్‎పై సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా విరుచుకుపడుతోన్న ప్రకాష్ రాజ్.. తాజాగా మరోసారి అతడిని టార్గెట్ చేశారు. అన్నాడీఎంకే పార్టీ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు పార్టీ వ్యవస్థాపకులు ఎంజీఆర్, మాజీ సీఎం జయలలితను పవన్ కొనియాడారు.

"ఏఐఏడీఎంకే 53వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ మద్దతుదారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. విప్లవ నాయకుడు పురట్చి తలైవర్ ఎంజీఆర్ వారసత్వం, పురట్చి తలైవి జయలలిత దూరదృష్టి గల నాయకత్వం తరతరాలుగా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. సమానత్వం, సామాజిక న్యాయం కోసం వారి అచంచలమైన నిబద్ధత.. అందరికి అన్ని హక్కులు అనే వారి పాలనా నమూనా మనందరికీ ఒక వెలుగురేఖ” అని పవన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‎కు రియాక్ట్ అయిన ప్రకాజ్ రాజ్.. ‘‘ఎంజీఆర్‏పై హ‌ఠాత్తుగా ఎందుకింత‌ ప్రేమో.. పైనుంచి ఆదేశాలు అందాయా” జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్‎ను ప్రశ్నించారు.

Also Read :- తొలి టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ

ప్రస్తుతం పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో పాటు అన్నాడీఎంకే ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్డీఏ కూటమి అంటే ప్రకాష్ రాజ్ ఒంటి కాలిపై లేస్తారు. ఆ కూటమికి మద్దతు ఇచ్చే పార్టీలపైన విమర్శలు ఎక్కుపెడుతుంటారు. ఇందులో భాగంగానే ఇటీవల వరుసగా పవన్ కల్యాణ్ ను ప్రకాష్ రాజ్ టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు ప్రకాష్ రాజ్ తీరుపై జనసేనాని అభిమానులు మండిపడుతున్నారు.