తిరుమల లడ్డూ వివాదంలోకి ప్రకాష్ రాజ్: పవన్ కల్యాణ్‎కు సూటిగా ప్రశ్నలు

తిరుమల లడ్డూ వివాదంలోకి ప్రకాష్ రాజ్: పవన్ కల్యాణ్‎కు సూటిగా ప్రశ్నలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని.. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు నూనె, కొవ్వు ఉపయోగించారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ స్వయంగా రాష్ట్ర  సీఎం కామెంట్స్ చేయడంతో ఈ టాపిక్ నేషనల్ వైడ్‎గా చర్చనీయాంశమైంది. 

ALSO READ | అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్

ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ ఇష్యూపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా లడ్డూ లొల్లిపై రియాక్ట్ అయిన ప్రకాష్ రాజ్.. జస్ట్ ఆస్కింగ్ పేరుతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‎ను సూటిగా ప్రశ్నించారు.

 

 

‘‘డియర్ పవన్ కళ్యాణ్ గారు.. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది. దయచేసి ఈ ఘటనపై విచారణ చేపట్టండి. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. అంతేకానీ మీరు ఎందుకు ఆందోళనలను వ్యాపింపజేస్తూ సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు. దేశంలో ఇప్పటికే మనకు తగినన్నీ మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు’’  అంటూ పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ప్రకాష్ రాజ్ పోస్ట్ పై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.