
హుస్నాబాద్, వెలుగు : ఎలక్షన్టైంలో రిటర్నింగ్ఆఫీసర్లు, సిబ్బంది అలర్ట్గా ఉంటూ వర్క్చేయాలని జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్ అన్నారు. సోమవారం ఆయన హుస్నాబాద్లోని ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కార్యాలయంతో పాటు ఎలక్షన్ స్ట్రాంగ్రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వచ్చేటప్పుడు ఐవోసీ బిల్డింగ్కు వంద మీటర్ల దూరంలోనే కార్యకర్తలను ఆపాలని, ర్యాలీలు చేయకుండా చూడాలని సూచించారు.
నామినేషన్లు వేసే అభ్యర్థులను మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. వారి వాహనాలకు పార్కింగ్ సదుపాయం, వాటర్ ఫెసిలిటీ కల్పించాలని చెప్పారు. అనంతరం మోడల్ స్కూల్లోని ఎలక్షన్ స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించారు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఎదురైతే వెంటనే ఆర్వోకు సమాచారాన్ని అందించాలన్నారు. పటిష్ట భద్రత ఏర్పాటుచేయాలని ఏసీపీ సతీశ్ను ఆదేశించారు. గ్రౌండ్లో ముండ్లపొదలు, రాళ్లు రప్పలు లేకుండా మొరంతో చదునుచేయించాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ కు సూచించారు.