
వరంగల్ సిటీ, వెలుగు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.ప్రతాప రెడ్డి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం చైర్మన్ప్రవీణ్ కుమార్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు.
ప్రతాపరెడ్డి 20 ఏళ్లపాటు ఎస్బీఐ భోపాల్ సర్కిల్ లో రియల్ ఎస్టేట్ హౌజింగ్ బిజినెస్ యూనిట్ను నడిపించారు. ఆ తరువాత ఏపీజీవీబీలో చేరారు. ఎస్బీఐలో కమర్షియల్ క్రెడిట్ సహా దేశీయ, విదేశీ అసైన్మెంట్ల కోసం పనిచేశారు.
నిజామాబాద్, హిమాయత్ నగర్ రీజియన్ మేనేజర్గా గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్, మెట్రో బ్రాంచ్లను పర్యవేక్షించారు. ప్రతాప్ ఏపీజీవీబీ చైర్మన్ గా ఐదేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీజీవీబీ తెలంగాణ, ఏపీలోని 28 జిల్లాల కస్టమర్లకు సేవలు అందిస్తోందన్నారు. తమకు 771 శాఖలు ఉన్నాయని చెప్పారు.