ప్రయాగ్​రాజ్​ ఫ్లైట్ ​6 గంటలు లేట్

ప్రయాగ్​రాజ్​ ఫ్లైట్ ​6 గంటలు లేట్
  • ఎయిర్​పోర్టులోనే 180 మంది ప్రయాణికులు పడిగాపులు
  • వారిలో సినీ నటుడు విజయ్​ దేవరకొండ, ఐపీఎస్​ ఆఫీసర్లు కూడా.. 

శంషాబాద్, వెలుగు: యూపీలోని ప్రయాగ్​రాజ్​లో కొనసాగుతున్న కుంభమేళాకు బయలుదేరాల్సిన స్పైస్​జెట్​విమానం శుక్రవారం ఆరు గంటలు ఆలస్యమైంది. ఉదయం10.15 గంటలకు బయలుదేరాల్సి ఉండగా టెక్నికల్​సమస్యతో శంషాబాద్ ఎయిర్​పోర్టులోనే నిలిచిపోయింది. 180 ప్రయాణికులు దాదాపు ఆరు గంటలపాటు పడిగాపులు కాశారు. వీరిలో ఐపీఎస్ లు షికా గోయల్, విజయ్ కుమార్, సినీ నటుడు విజయ్ దేవరకొండ, పలువురు ప్రముఖులు ఉన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఎయిర్​పోర్టు అధికారులు ఫ్లైట్​ను సిద్ధం చేసి ప్రయాగ్ రాజ్ పంపించారు.