
ఏటూరునాగారం, వెలుగు: అంబులెన్స్ పోయే దారి లేక బాలింతను జీపీ ట్రాక్టర్లో 8 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి 108లో ఎక్కించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట జీపీ పరిధిలోని నీలాలతోగు గుత్తికోయ గూడెంకు చెందిన మడకం జ్యోతి వారం క్రితం పురిటి నొప్పులతో ములుగు ఏరియా ఆసుపత్రికి వెళ్లింఇ. జ్యోతికి బ్లడ్లెవల్తక్కువ ఉందని వరంగల్ఎంజీఎంకు వెళ్లమని డాక్టర్లు చెప్పారు. ఎంజీఎంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో తిరిగి ములుగు ఏరియా ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్లు జ్యోతికి ఆపరేషన్ చేసి కాన్పు చేశారు. ఆపరేషన్తర్వాత కుట్లు సరిగా వేయకపోవడం, అవి మానక ముందే ఇంటి దగ్గర వదిలి పెట్టడంతో శుక్రవారం జ్యోతికి బ్లీడింగ్అయ్యి పరిస్థితి విషమించింది. నీలాలతోగు వరకు 108 వెళ్లడానికి దారి లేకపోవడంతో విషయం తెలుసుకున్న సర్పంచ్రమ జీపీ ట్రాక్టర్ పంపించారు. అందులో సుమారు 8 కిలోమీటర్లు తీసుకువెళ్లి 108 వద్దకు చేర్చారు. అక్కడి నుంచి 108 సిబ్బంది ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల నిర్లక్ష్యమే జ్యోతి ఆరోగ్య పరిస్థితి విషమించడానికి కారణమని స్థానికులు ఆరోపించారు.