
పట్వారీ, అసిస్టెంట్ జైలర్, ప్రైమరీ స్కూల్టీచర్, సబ్ఇన్స్పెక్టర్, హైస్కూల్టీచర్, కాలేజీ లెక్చరర్, చివరికి ఐపీఎస్. 2010 నుంచి 2016 వరకు ఓ వ్యక్తి సాధించిన ఉద్యోగాలివీ. ఆశ్చర్యంగా ఉందా? ఆరేళ్లలో ఏడు సర్కారీ కొలువులు.. ఎలా సాధ్యమనిపిస్తుంది కదూ! ఏదో ఒక జాబ్ వచ్చిందని అక్కడే ఆగిపోకుండా, లక్ష్యం నెరవేరే వరకూ పోరాడితే సాధ్యమేనని నిరూపించాడు రాజస్థాన్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రేమ్సుఖ్ దేలు. 31 ఏండ్ల ఈ యంగ్ ఆఫీసర్ పట్వారీగా ప్రస్థానం ప్రారంభించి ఐపీఎస్వరకు ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిని ఇస్తోంది.
ఇదీ ప్రేమ్ సక్సెస్ స్టోరీ..
ప్రేమ్ రాజస్థాన్ బికనీర్జిల్లాలో ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. ఏదైనా పెద్ద గవర్నమెంట్జాబ్కొట్టాలని అనుకున్న ప్రేమ్ కష్టపడి చదువుతూ ఎంఏ హిస్టరీ పూర్తి చేశాడు. 2010లో తొలిసారి పట్వారీ (రెవెన్యూ ఆఫీసర్) ఉద్యోగం సంపాదించాడు. ఇక ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూడలేదు. ఒకటి తర్వాత ఒకటి ఏడు కొలువులు కొట్టేశాడు. పట్వారీ అయిన ఏడాదే అసిస్టెంట్జైలర్గా ఎంపికయ్యాడు. ఈ పరీక్షలో రాష్ట్రంలోనే టాప్ప్లేస్లో నిలిచాడు. 2011లో ప్రైమరీ టీచర్గా, 2013లో సబ్ఇన్స్పెక్టర్గా, హైస్కూల్టీచర్గా సెలెక్ట్ అయ్యాడు. తర్వాత బీఈడీ కంప్లీట్చేసి, నెట్(నేషనల్ఎలిజిబిలిటీ టెస్ట్) సాధించాడు. అనంతరం కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం. అయినా ప్రేమ్ ఆగలేదు.. కొలువుల వేట కొనసాగించాడు. స్టేట్పబ్లిక్సర్వీస్ కమిషన్పరీక్షల్లో కొంచెం తేడాతో పోలీస్ఉద్యోగం చేజారినా, రెవెన్యూ సర్వీస్లో సెలెక్ట్ అయ్యాడు. అయితే ఓటమిని అంగీకరించని ప్రేమ్..2015లో యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ రాశాడు. హిందీ మీడియంలో మెయిన్స్రాసిన ప్రేమ్..170వ ర్యాంక్సాధించి2016లో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. ట్రెయినింగ్ పూర్తి చేసుకుని గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో ఏఎస్పీగా ఇటీవల జాయిన్ అయ్యాడు.
జాబ్ చేస్తూనే ప్రిపరేషన్
ప్రేమ్ఈ జాబ్లన్నీ అంత ఈజీగా ఏమీ కొట్టలేదు. ఎంతో కష్టపడ్డాడు. ఓవైపు జాబ్ చేస్తూనే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవాడు. రోజూ 5 గంటలు ప్రిపరేషన్కు కేటాయించేవాడు. ‘‘అమ్మానాన్న చదవుకోలేదు. ఇంట్లో చదువుకు ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు. కానీ కానిస్టేబుల్ అయిన మా అన్న ప్రోత్సాహంతోనే నేను కాంపిటిటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యాను” అని ప్రేమ్ చెప్పాడు. ‘‘నీ లక్ష్యం చేరే వరకూ ఆగిపోకు” అని చెప్పే ప్రేమ్… ఐపీఎస్ ఆఫీసర్గానూ ప్రతిభ చూపారు. రెండుసార్లు పరేడ్ కమాండెంట్గా వ్యవహరించాడు. సర్దార్వల్లభాయ్ పటేల్భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రధాని వచ్చిన టైంలో ఈయనే కమాండెంట్. అలాంటి మేజర్ ఈవెంట్కు గుజరాత్ పోలీసుల తరఫున రిప్రజెంట్ చేయడం తన అదృష్టమని చెప్పాడు. అయితే ఇంతటితోనే ఆగిపోనని, మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని ప్రేమ్ చెప్తున్నారు.