
హాలియా, వెలుగు : సీఎం కేసీఆర్ను జనం నమ్మే పరిస్థితి లేదని మాజీ సీఎల్పీ లీడర్కుందూరు జానారెడ్డి అన్నారు. సోమవారం అనుముల మండలం శ్రీనాథపురం గ్రామ ఎంపీటీసీ కొండ రమేశ్, చింతగూడెం సర్పంచ్ కూరాకుల లింగమ్మ, హాలియా మున్సిపాలిటీలోని ఆర్య క్షత్రియ సంఘం నాయకులు, త్రిపురారం మండలం అంజనపల్లి, రాగడప, గంటారావు క్యాంపు గ్రామాలకు చెందిన 300 మంది బీఆర్ఎస్కు రిజైన్ చేసి కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా జానా రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేకుండానే కొత్త హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీమ్లు అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జయవీరు కుందూరు, నేతలు కందూరు వెంకట్ రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, చింతల చంద్రారెడ్డి, కుందూరు రాజేందర్ రెడ్డి, రమేశ్ యాదవ్, మల్ రెడ్డి భానుచందర్ రెడ్డి, నకిరేకంటి సైదులు తదితరులు పాల్గొన్నారు.