నేడు ములుకనూరు  సొసైటీ వార్షిక మహాసభ

నేడు ములుకనూరు  సొసైటీ వార్షిక మహాసభ

భీమదేవరపల్లి, వెలుగు: ములుకనూర్​సొసైటీ 68వ వార్షిక మహాసభ సంఘం ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు ఎ.ప్రవీణ్​రెడ్డి తెలిపారు. అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి కొంత మంది కలిసి 1956లో 373 మంది సభ్యులతో 2300 వందల వాటాధనంతో ములుకనూర్​ సొసైటీని ప్రారంభించారన్నారు. 14 గ్రామాల్లో 7641 మంది సభ్యులతో మూడు వేల కోట్లకు పైగా వ్యాపారాన్ని ములకనూరు సొసైటీ  నిర్వహిస్తోందన్నారు.