కాంట్రాక్ట్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు చెల్లించాలి

కాంట్రాక్ట్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు చెల్లించాలి

అశ్వారావుపేట, వెలుగు : గవర్నమెంట్​ హాస్పిటళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కు పెండింగ్​  వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమైఖ్య జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అశ్వారావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యలపై  వారితో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలనెలా వేతనాలు రాక కాంట్రాక్ట్ వర్కర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నంబర్ 60 ప్రకారం రెగ్యులర్​గా ప్రతినెలా వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కోశాధికారి సతీశ్,  కాంట్రాక్ట్ వర్కర్స్ రహమత్, నాగమణి, వెంకటేశ్వరరావు, స్వాతి, సుజాత, వెంకటకృష్ణ, సత్యనారాయణ, లక్ష్మి, అనూష తదితరులు పాల్గొన్నారు.