గతంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేసింది

గతంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేసింది

బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ చేసిన ట్వీట్​కు టీపీసీసీ చీఫ్​ మహేష్​కుమార్​గౌడ్​ సమాధానమిచ్చారు.  బీఆర్​ఎస్​ అధికారం కోల్పోయిన తరువాత చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి  ఆపార్టీ నేత కేటీఆర్​ కాంగ్రెస్​ నేత విమర్శిస్తున్నారని టీపీసీసీ చీఫ్​ అన్నారు. తెలంగాణ ఆదాయం తగ్గిందని  కేటీఆర్​ చేసిన ట్వీట్​కు సమాధానంగా.. ఏ అంశాల్లో తగ్గిందో చెప్పాలన్నారు.  బీఆర్​ఎస్​ ప్రభుత్వం  రూ. 8 లక్షల కోట్లు అప్పుచేసింది.. ఆ అప్పుకు వడ్డీ చెల్లించేందుకు వచ్చే ఆదాయంలో 60 శాతం ఖర్చవుతుందన్నారు.ఇష్టారాజ్యంగా అప్పులు చేసి ప్రజలపై గత ప్రభుత్వం భారం మోపిందన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్​ రైతులకు ఉపయోగపడదరి తెలిసినా.. రూ.1.20 వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు.  బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఆపార్టీ నేతల జేబులు నింపుకొనేందుకు  అనవసరమైన ఖర్చులు పెట్టి.. కమీషన్లు దోచుకున్నారని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్​ గౌడ్​ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్​ కుటుంబం తప్ప తెలంగాణలో ఏ కుటుంబం బాగుపడలేదన్నారు.  కేసీఆర్​ పాలనతో విసుగొచ్చిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్​ ప్రభుత్వానికి అధికారం అప్పగించారన్నారు.  తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా  కాంగ్రెస్​ ప్రజాపాలన జరుగుతుందని తెలిపారు. 

Also Read :  మాకు రక్షణ లేదు.. మమ్మల్ని వదిలేయండి

హైడ్రా విషయంలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల విమర్శలను తిప్పికొట్టారు.  మీ ఎమ్మెల్యేలు కబ్జా చేశారని విమర్శిస్తున్నారా అని ప్రశ్నించారు.  కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత... కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నిర్మించిన కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేసిందన్నారు.  హైడ్రాకు తన, మన బేధాలుండవంటూ.. ఎవరు అక్రమంగా భవనాలు నిర్మించుకున్న కూల్చడమే హైడ్రా ఎజెండా అని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్​ గౌడ్​ అన్నారు.