గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలె: మారం జగదీశ్వర్

గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలె: మారం జగదీశ్వర్

హైదరాబాద్: కాంగ్రెస్​ఇచ్చిన మాటకు కట్టుబడి  సీపీఎస్ ను తొలగించాలని  జేఏసీ చైర్మన్​ మారం జగదీశ్వర్​ డిమాండ్​ చేశారు.ఉద్యోగుల జేఏసీ ఎగ్జిక్యూటివ్​ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఇప్పటివరకు 4డీఏలు పెండింగ్​లో ఉన్నాయన్నారు.  కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో  అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 

ఉద్యోగుల అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.  ప్రొఫెసర్​ కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల  ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.  త్వరలోనే సన్మాన సభను నిర్వహిస్తామన్నారు. ఇవాళ సమావేశంలో  జేఏసీలో  27 సంఘాలతో స్టీరింగ్​ కమిటీ ఏర్పాటు చేసుకున్నట్లుగా ఆయన తెలిపారు.  సెప్టెంబర్​1న పెన్షన్​ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టాలన్నారు.