
తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. తెలంగాణ రాష్ట్రానికి రేపు (27వ) తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. మొదట ప్రియాంక గాంధీ చేతుల మీదుగా.... చేవెళ్ల గడ్డ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఆమె టూర్ అకస్మాత్తుగా అనివార్య కారణాలతో రద్దయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి రేపు ( ఫిబ్రవరి 27) ఎన్నికల హామీల్లో ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రెండు గ్యారంటీలను అమలుచేయనున్నారు.