సోమ్​నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు

సోమ్​నాథ్  ఆలయంలో ప్రధాని మోదీ పూజలు

గిర్​సోమ్​నాథ్: గుజరాత్​లోని సోమ్​నాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. జ్యోతిర్లింగాల లో మొదటిదైన శివాలయాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు ఉదయం జామ్​నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన వంతారాను సందర్శించు కున్నారు. 

ఆ తర్వాత జునాగఢ్ జిల్లాలోని ఆసియా సింహాల నివాసమైన గిర్ వన్యప్రాణుల అభయారణ్య ప్రధాన కార్యాలయం సాసన్​కు మోదీ బయల్దేరారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సాసన్ లో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్ బీడబ్ల్యూఎల్) మీటింగ్ కు అధ్యక్షత వహించనున్నారని అధికారులు తెలిపారు.