హనుమాన్ తో నిర్మాతలుగా సక్సెస్ అయ్యారు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రస్తుతం వరుస చిత్రాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్పైనా ఫోకస్ పెట్టారు. తాజాగా రామ్ నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ వరల్డ్వైడ్ థియేట్రికల్ రైట్స్ను సొంతం చేసుకున్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్గా రాబోతున్న ఈ చిత్రంలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్ డబుల్ డోస్లో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.