![అడ్వాన్స్టెక్నాలజీ సెంటర్ ద్వారా ట్రైనింగ్ : సంజయ్ కుమార్](https://static.v6velugu.com/uploads/2025/02/principal-secretary-of-industries-department-sanjay-kumar-inspected-the-atc-center-in-mandamarri_xPjNfgkRJw.jpg)
కోల్ బెల్ట్, వెలుగు: అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా స్టూడెంట్లకు అధునాతన కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వంప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్అన్నారు. టాటా టెక్నాలజీ కంపెనీ, సర్కార్ సంయుక్తంగా మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో నిర్మిస్తున్న ఏటీసీ సెంటర్ ను మంగళవారం ఆయన పరిశీలించారు. సెంటర్ నిర్మాణ పనులు, స్టూడెంట్లకు అందిస్తున్న కోర్సుల తీరును ఐటీఐ ప్రిన్సిపల్ దేవానంద్, ఫ్యాకల్టీని అడిగి తెలుసుకున్నారు.
గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 68 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను మంజూరు చేశామని, ఒక్కోదానికి రూ.42 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఐటీసీల్లో ఆరు ఇండస్ట్రీస్ కోర్సులపై శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. టెక్నాలజీని స్టూడెంట్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, టీజీఐఐసీ చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.