లింగంపేట్‌‌‌‌‌‌‌‌లో ప్రైవేటు హాస్సిటల్ సీజ్ 

లింగంపేట్‌‌‌‌‌‌‌‌లో ప్రైవేటు హాస్సిటల్ సీజ్ 
  • ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీ ముసుగులోనే ఎంబీబీఎస్ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెలామణి  
  • బీటెక్ విద్యార్థి మృతితో వైద్యాధికారుల కొరడా

లింగంపేట, వెలుగు : కామారెడ్డి జిల్లా లింగంపేటలో  ప్రభుత్వనిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రాహుల్​ క్లినిక్, ఆపరేషన్​ థియేటర్​ను బుధవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ ప్రొగ్రాం అధికారి ప్రభుకుమార్​, సిబ్బందితో కలిసి సీజ్​ చేశారు. రాహుల్​క్లినిక్​ పేరిట ఆర్ఎంపీ వైద్యుడు రాజు ఎంబీబీఎస్​ డాక్టర్​ హరినారాయణతో కలిసి ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు బోర్డులు ఏర్పాటు చేశాడు. అందులో  ఆపరేషన్​ థియేటర్ ఏర్పాటు చేసి ఆపరేషన్​లు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.

ఎంబీబీఎస్​  డాక్టర్​ పర్యవేక్షణలో రోగులకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేయాల్సి ఉండగా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీ వైద్యుడు రాజు ఒక్కడే వైద్యం చేస్తున్నాడని రోగులకు వివిధ రకాల టెస్టుల కోసం రిఫర్ చేస్తున్నట్లు తేలింది. మండలంలోని బాయంపల్లి తండాకు చెందిన బీటెక్​ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు వైద్యం అందించినట్లు విచారణలో తేలిందని దీంతో ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక పీహెచ్​సీ డాక్టర్​ హిమ బిందు, సిబ్బంది రమేశ్​,శ్రీనివాప్​,శివయ్య, ఫరీదా,యాదగిరి, తదితరులు ఉన్నారు.