
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ స్మైల్ పే ప్రారంభించింది. ఈ టెక్నాలజీ వల్ల వినియోగదారులు తమ ముఖాన్ని మాత్రమే ఉపయోగించి లావాదేవీలను పూర్తి చేస్తారు. రిలయన్స్ రిటైల్, అనన్య బిర్లా స్వతంత్ర మైక్రో హౌసింగ్ ఫైనాన్స్ (ఎస్ఎంహెచ్ఎఫ్) ఔట్లెట్లలో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వాడతారు. యూఐడీఏఐ ఆధార్ పే ఆధారంగా రూపొందించిన భీమ్ ఫేషియల్ వెరిఫికేషన్టెక్నాలజీతో స్మైల్ పే పనిచేస్తుంది.
అంటే కస్టమర్ తన ముఖాన్ని కెమెరాకు చూపించగానే చెల్లింపు పూర్తవుతుంది. సంప్రదాయ పద్ధతిలో యూపీఐ పిన్నంబర్ను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. కస్టమర్లు నగదు, కార్డులు లేదా మొబైల్ పరికరాలను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా లావాదేవీలను పూర్తి చేయవచ్చు. స్మైల్పే సురక్షితమైన యూఐడీఏఐ అథెంటికేషన్ ఫేస్ సర్వీస్ ద్వారా పనిచేస్తుంది. ఇది సురక్షితమైన, విశ్వసనీయమైన లావాదేవీలను అందిస్తుందని ఫెడరల్బ్యాంక్ తెలిపింది.