మృగాల దాడుల్లో జనం బలవుతున్నా పట్టదా?

మృగాల దాడుల్లో జనం బలవుతున్నా పట్టదా?
  • కేంద్రం, కేరళ సర్కార్​పై 
  • కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్​ 

వయనాడ్: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్​ ఏరియాలో క్రూర మృగాల దాడులకు అమాయకులు బలవుతున్నా.. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్​, కేరళ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడటంతోపాటు, జంతువుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. 

వయనాడ్​లోని తిరువంబారీలో ఆదివారం పార్టీ​ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్డీయే సర్కార్​  రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఇలా జరగడం దేశంలో ఇదే తొలిసారి అని, ఇలాంటి చర్యలను అడ్డుకుని తీరుతామన్నారు.